News November 14, 2024
వరుణ్ తేజ్ ‘మట్కా’ పబ్లిక్ టాక్

కరుణ కుమార్ డైరెక్షన్లో వరుణ్ తేజ్-మీనాక్షి చౌదరి నటించిన ‘మట్కా’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినప్పటికీ కథలో కొత్తదనం లేదని, చాలా స్లోగా ఉందని, పాటలు ఆకట్టుకోలేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మెగా ప్రిన్స్ లుక్లో వేరియేషన్స్, యాక్టింగ్ బాగుందని మరికొందరు చెబుతున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ
Similar News
News November 9, 2025
బాడీ షేమింగ్.. హీరోయిన్కు క్షమాపణలు

బాడీ షేమింగ్కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.
News November 9, 2025
తెలంగాణ రైతులకు బిహార్ ఎన్నికల దెబ్బ!

బిహార్ ఎన్నికలు రైతులకు సమస్యను తెచ్చి పెట్టాయి. ఓటేసేందుకు బిహారీలు సొంత రాష్ట్రానికి వెళ్తుండటంతో హమాలీల కొరత ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. మిల్లుల వద్ద లోడింగ్, అన్లోడింగ్ కావడం లేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో 20వేల మంది హమాలీలు ఉంటే 18వేల మంది బిహారీలే. ఓటేసేందుకు రాజకీయ పార్టీలు వారికి రూ.5వేల చొప్పున ఇచ్చి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న అక్కడ ఎన్నికలు ముగుస్తాయి.
News November 9, 2025
ఇదే జోరు కొనసాగితే 2027కి పోలవరం పూర్తి: అతుల్ జైన్

AP: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతున్నాయని పీపీఏ సీఈవో అతుల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్లో పనులను, టెస్టింగ్ ల్యాబ్ను ఆయన పరిశీలించారు. అలాగే నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు నిధుల ఢోకా లేదని, ఇదే జోరు కొనసాగితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు.


