News November 14, 2024
సచివాలయ ఉద్యోగులకు అలర్ట్

AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
Similar News
News February 8, 2026
అరటిలో బోరాన్ లోపం లక్షణాలు – నివారణ

అరటిలో బోరాన్ ధాతు లోపం వల్ల ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా, పెళుసుగా మారతాయి. ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల తగ్గి, గెలలు చిన్నవిగా ఉండి, మొవ్వు నుంచి పూర్తిగా బయటకు రాదు. కాయలపై నిలువు పగుళ్లు ఏర్పడతాయి. పండు పరిమాణం, నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్/ బోరిక్ ఆమ్లం 1గ్రా. కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.
News February 8, 2026
AERAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(A<
News February 8, 2026
అన్నదానం ఎంత పుణ్యమో..

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఉడికించిన బియ్యమే కాదు, ప్రాణశక్తినిచ్చే ప్రతి ఆహారం అన్నమే. మన శరీరంలోని ‘అన్నమయ కోశం’ ఆహారం వలనే ప్రాణశక్తిని పొందుతుంది. అందుకే అన్నదానమంటే ప్రాణం దానం చేయడమే. అందుకే అన్నదానం చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఓ కోయవాడు బ్రాహ్మణుడికి ఓ రాత్రి అన్నం పెట్టిన పుణ్యంతోనే మరుజన్మలో రాకుమారుడిగా జన్మించాడు. అన్నదానానికి విచక్షణతో పనిలేదు. ఆకలితో ఉన్నవారికి పెట్టడమే పరమోత్కృష్టం.


