News November 14, 2024

శ్రీకాకుళం: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నాలుగు రోజులే గడువు

image

శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ సందర్భంగా తొలుత ప్రభుత్వం అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ లోపు చెల్లించాలని ప్రకటించగా దాన్ని ఈ నెల 18వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీనితో 10వ తరగతి విద్యార్థులు 18వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Similar News

News January 13, 2026

కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

image

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.