News November 14, 2024

టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో కేకే రాజు, భాగ్యలక్ష్మికి చోటు

image

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా రాష్ట్రం అంతటా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాకు భాగ్యలక్ష్మి, కెకె రాజులను టాస్క్‌ఫోర్స్‌ కమిటీగా నిర్ణయించింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా వీరు పని చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతలు, లీగల్‌సెల్‌ ప్రతినిధుల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుంది.

Similar News

News April 17, 2026

ఏయూ శతాబ్ది ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

image

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్‌ ఆదేశించారు. శుక్రవారం ఏయూ సమీక్షలో మాట్లాడరు. ఏప్రిల్ 27న ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే కార్యక్రమానికి సుమారు 25 వేల మంది హాజరుకానున్నారు. వీవీఐపీలు రానున్న నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ఎల్ఈడీ స్క్రీన్లు పటిష్ఠంగా ఉండాలన్నారు.

News April 17, 2026

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం

image

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులోని మంగవారిపేట జంక్షన్ వద్ద గురువారం ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. నగర పర్యాటనకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారు. సీసీ కెమెరా స్తంభాన్ని కూడా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బీచ్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

News April 17, 2026

విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

image

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.