News November 15, 2024
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ చేస్తున్నారు: మెదక్ ఎంపీ

రాష్ట్రంలో పాలన పడకేసిందని, సీఎం రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శంచారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులే సీఎం రేవంత్ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఖమ్మం మిర్చి యార్డులో రైతులను అరెస్టు చేసి బేడీలు వేసినప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో అరెస్టుల పర్వం కొనసాగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
Similar News
News April 18, 2026
మెదక్: వారసత్వ సంపదను కాపాడుకుందాం..!

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. గంభీరమైన మెదక్ ఖిల్లా, ఏడుపాయల ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చర్చి, వేల్పుగొండ ఆలయం వంటివి జిల్లా ఖ్యాతిని చాటుతున్నాయి. వీటితో పాటు కొంటూరు మసీదు, చందంపేట మెట్ల బావి, ఘనపూర్ ఆనకట్ట వంటి కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
News April 18, 2026
ప్రకృతి నడుమ ఆధ్యాత్మికతకు ప్రతీక ఏడుపాయల ఆలయం

ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఏడూ వాగులు సంగమించే ప్రదేశంలో వెలసిన వన దుర్గాభవాని అమ్మవారిని దర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారు స్వయంభువుగా వెలసి భక్తులను కాపాడుతున్నారని విశ్వాసం. మహాశివరాత్రి, జాతర సమయంలో ఆలయం సందడిగా మారుతుంది. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది.
News April 18, 2026
చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా

మెదక్లో చారిత్రక కీర్తిని చాటుతూ నిలిచిన మెదక్ ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మాణం చెంది, అనంతరం కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు అభివృద్ధి చేశారు. బలమైన గోడలు, అద్భుత నిర్మాణ శైలి ఖిల్లా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైభాగం నుంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాంత చరిత్రను గుర్తు చేస్తూ వారసత్వ చిహ్నంగా ఇది నిలిచింది.


