News November 15, 2024
IPL: 2 సెట్లుగా టాప్ క్రికెటర్ల వేలం

IPL మెగా వేలం Nov 24, 25ల్లో జరగనున్న నేపథ్యంలో ప్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. రిటైన్ కానివారు, కొత్త క్రికెటర్లు వేలంలో పాల్గొనున్నారు. అయితే ఈ వేలంలోని టాప్ క్రికెటర్లను 2 సెట్లుగా విభజించినట్లు BCCI తెలిపింది. పంత్, రాహుల్, శ్రేయస్, సిరాజ్, షమీ, అర్ష్దీప్, అశ్విన్, స్టార్క్, బట్లర్ వంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉంటారు. ప్రతి సెట్లో 8-9 మంది టాప్ క్రికెటర్లుంటారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.
News January 15, 2026
సంక్రాంతి రోజు ఇలా చేస్తే మంచిది!

పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని పండితుల మాట. ‘కొత్త దుస్తులు ధరించి సూర్యుడిని స్మరించుకోవాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయాలి. ఇష్టదైవానికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఉదయం సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణుడి వ్రతాలు చేస్తే పుణ్యఫలం దక్కి కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా శక్తిమేర దానం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది’ అని చెబుతున్నారు.
News January 15, 2026
114 రాఫెల్స్.. రూ.3.25 లక్షల కోట్ల డీల్!

భారత రక్షణ రంగంలోనే అతిపెద్ద ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.3.25 లక్షల కోట్ల డీల్ను రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఈ వారాంతంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా 30% స్వదేశీ పార్ట్స్తోనే ఇండియాలోనే తయారీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ డీల్ ఫిక్స్ అయితే భారత్లో రాఫెల్స్ సంఖ్య 176కు పెరగనుంది.


