News November 15, 2024
అల్పపీడనం.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఇది పంట చేతికి వచ్చే సమయం కావడంతో వర్షం సూచనలు రైతులను బెంబెలేత్తిస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట నీటి పాలవుతుందేమోనని భయాందోళనకు గురువుతున్నారు. పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
Similar News
News September 14, 2025
ఉల్లి కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉత్పత్తులను కలెక్టర్ సిరి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఎగుమతుల పరిస్థితి, కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి కొనుగోలు విషయంలో ఆలస్యం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్పనిసరిగా చెల్లించాలన్నారు.
News September 13, 2025
కర్నూలు: ‘ప్రజల వద్దకే తపాల సేవలు’

తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీపీఎంలు, ఎబీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్తో తపాల బీమా, ఐపీపీబీ ద్వారా ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు.
News September 13, 2025
సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాను సమిష్ఠి కృషితో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ సిరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు కలెక్టర్గా ఇది తన మొదటి పోస్టింగ్ అని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.