News November 15, 2024
ఆత్మకూరు: వైఎస్సార్ విగ్రహంపై దాడి

ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా విగ్రహానికి సమీపంలో ఉన్న సచివాలయం శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 8, 2026
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. అర్జీలు పరిష్కారం కాలేదా లేదా స్థితి తెలుసుకోవాలంటే 1100కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు. ఈ నెల 9న అనంతపురం కలెక్టరేట్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు.
News March 8, 2026
ఏప్రిల్ నెలాఖరులోగా పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

జిల్లాలోని 20 సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శింగనమల మండలం పెరవలిలో PM-KUSUM పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. రైతులు, మెఘా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు.
News March 8, 2026
ఏప్రిల్ నెలాఖరులోగా పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

జిల్లాలోని 20 సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శింగనమల మండలం పెరవలిలో PM-KUSUM పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. రైతులు, మెఘా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు.


