News November 15, 2024

పొన్నలూరు క్రీడాకారిణి మైథిలి మరణం.. కేసు 

image

పొన్నలూరు మండలానికి చెందిన క్రీడాకారిణి మైథిలి గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే బాలిక మృతికి జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ వనజ, పీఈటి బన్నీ, కృపాకర్ కారణం అంటూ కొద్దిరోజులుగా తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. పోటీలు జరిగిన తర్వాత తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చలేదని పవన్ కళ్యాణ్‌ని కలసి వివరించారు. దీంతో గురువారం ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

Similar News

News January 13, 2026

సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

image

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.

News January 13, 2026

త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

image

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 13, 2026

మరోసారి తెరపైకి ప్రకాశం జిల్లా ఎయిర్‌పోర్ట్

image

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పో‌ర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్‌తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పో‌ర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.