News November 15, 2024
కోదాడలో రైఫిల్ షూటింగ్ పోటీలు

కోదాడలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఎయిర్ రైఫిల్, పిస్టల్, పీప్ సైట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అండర్ 17, 14 విభాగాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు కళాశాలల నుంచి 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ అజం బాబా, పీడీలు మైసయ్య, వీవీ చారి, కొండలు, ప్రభాకర్, రంగారావు, నాని, అంజి క్రీడాకారులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
NLG: ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం: కలెక్టర్

రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్స్పాట్లలో శాశ్వత చర్యలు చేపట్టాలి. స్కూల్ బస్సులకు సైడ్ మిర్రర్లు, సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News November 10, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→ మిర్యాలగూడ: అమానుషం.. కుక్క నోట్లో మృతశిశువు
→ నల్గొండ: ప్రజావాణికి 94 దరఖాస్తులు
→ నార్కట్పల్లి: లారీ బోల్తా.. ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్ళారు.
→ నల్గొండ: ఇన్చార్జి పాలన ఇంకెనాళ్లు?
→ కట్టంగూర్: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ
→ నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ
→ నల్గొండ: MGUకి అరుదైన గౌరవం
→ నాగార్జునసాగర్: ఆయకట్టులో జోరుగా వరికోతలు
News November 10, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.


