News November 15, 2024
‘టెంపుల్ టూరిజం’ బలాన్ని AP గుర్తించడం లేదా?

మన దేశానికున్న అతిపెద్ద బలం టెంపుల్ టూరిజం. కాశీ, అయోధ్య, ప్రయాగ వల్ల UPకి ఆదాయం బాగా పెరిగింది. హోటల్ సహా అనేక అనుబంధ రంగాలు రాణిస్తున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఒంటిమిట్ట, శ్రీశైలం, విజయవాడ, ద్రాక్షారామం, అన్నవరం, అరసవెల్లి, సింహాచలం, ఆంధ్రమహా విష్ణు వంటి ఆలయాలు AP సొంతం. వీటిపై మరింత ఫోకస్ పెట్టి టెంపుల్ టూరిజాన్ని పెంచితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం. మీరేమంటారు?
Similar News
News March 18, 2026
TODAY HEADLINES

☛ రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG: CM CBN
☛ చంద్రబాబు తీరువల్లనే డ్రగ్స్ దందాలు: జగన్
☛ మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన TG ప్రభుత్వం
☛ KCR కూడా డ్రగ్ టెస్ట్కు రావాలి: TPCC చీఫ్
☛ ఆరు గ్యారంటీల ఫైల్ ఎక్కడ? కాకి ఎత్తుకెళ్లిందా?: KTR
☛ ఇంకా ఆందోళనకరంగానే గ్యాస్ నిల్వలు: కేంద్రం
☛ అఫ్గాన్పై పాక్ దాడులు.. ఖండించిన భారత్
News March 18, 2026
UG, PG విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులు

TG: రాష్ట్రంలోని విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. UGలో 19, PGలో 10 కోర్సులు, AEDP(అప్రెంటిస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2030 నాటికి వివిధ రంగాల్లో 20L ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని, వాటిని సాధించేలా యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
News March 18, 2026
24 గంటల్లోనే అణుబాంబు వేసేవారు: ట్రంప్

ఇరాన్పై దాడి చేయకపోయి ఉంటే వారు అణుబాంబును తయారు చేసుకునేవారని ట్రంప్ అన్నారు. అదే జరిగితే 24 గంటల్లోనే దాన్ని ప్రయోగించి ఉండేవారని పేర్కొన్నారు. ఇది కేవలం పశ్చిమాసియాలోనే గాక యూరప్ వరకు పాకి ఉండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా నేషనల్ కౌంటర్టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ <<19409994>>రాజీనామాపై<<>> స్పందిస్తూ.. భద్రతాపరమైన విషయంలో ఆయన చాలా వీక్ అని, వెళ్లిపోవడమే మంచిదైందని వ్యాఖ్యానించారు.


