News November 15, 2024
2800 ఏళ్ల నాటి అమర ప్రేమ ఇది!

కొన్ని ప్రేమ కథలు కాలాల్ని దాటి ప్రయాణిస్తాయి. అలాంటిదే ఈ కథ. ఆర్కియాలజిస్టుల కథనం ప్రకారం.. 2800 ఏళ్ల క్రితం ఇరాన్లోని టెప్పే హసన్లు ప్రాంతానికి చెందిన ఓ జంట, తమ తండాలో కార్చిచ్చు నుంచి పారిపోతూ ఓ గుంతలో తలదాచుకున్నారు. మృత్యువు వెంటాడటంతో ప్రాణాలు పోయే చివరి క్షణంలో ఒకరినొకరు ముద్దాడారు. 1972లో ఈ ప్రేమికుల అస్థిపంజరాలు వెలుగుచూశాయి. ఆ ప్రాంతం పేరిట వీరిని ‘హసన్లూ ప్రేమికులు’గా పిలుస్తున్నారు.
Similar News
News July 6, 2025
బ్లాక్ మార్కెట్ దందాపై విచారించాలి: KTR

TG: కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులకూ కరువొచ్చింది. రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటమేంటి? యూరియా బస్తా ధర ₹266.50 నుంచి ₹325కు ఎందుకు పెరిగింది? ఈ బ్లాక్ మార్కెట్ను నడిపిస్తుంది ఎవరు? ప్రభుత్వం విచారించాలి’ అని డిమాండ్ చేశారు.
News July 6, 2025
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

TG: NZB(D) బోధన్(మ) మినార్పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 6, 2025
బిహార్ను క్రైమ్ క్యాపిటల్గా మార్చేశారు: రాహుల్ గాంధీ

BJP, CM నితీశ్ కలిసి బిహార్ను భారతదేశ క్రైమ్ క్యాపిటల్గా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పట్నాలో <<16949011>>గోపాల్ ఖేమ్కా హత్య<<>> ద్వారా ఇది మరోసారి రుజువైందన్నారు. ‘బిహార్లో నేరాలు సాధారణంగా మారినా అసమర్థ ప్రభుత్వం ఏం చేయట్లేదు. భద్రత ఇవ్వలేని వారికి మీ భవిష్యత్తును అప్పగించొద్దు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బిహార్ను కాపాడేందుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.