News November 15, 2024
ఆ సంస్థలతో మళ్లీ చర్చలు: నారాయణ

AP: అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని సబ్ కమిటీ చర్చలు జరిపింది. గతంలో ఏయే సంస్థలకు ఎంతెంత భూములు కేటాయించారనే దానిపై స్టడీ చేయడంతో పాటు ఆయా సంస్థలతో చర్చలు జరపాలని CRDA అధికారులను ఆదేశించింది. ‘గత ప్రభుత్వం 3 ముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలకు ముందుకు రాలేదు. మా ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు ప్రారంభిస్తామని ఆ సంస్థలు ముందుకొస్తున్నాయి’ అని నారాయణ చెప్పారు.
Similar News
News February 6, 2026
‘ఢిల్లీని షేక్ చేస్తాం’.. లష్కరే టెర్రరిస్టు ప్రేలాపనలు

ఇండియాలోని ప్రధాన సిటీల్లో దాడులు చేస్తామంటూ లష్కరే తోయిబా (LeT) టెర్రరిస్టు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ హెచ్చరించాడు. ‘అఖండ భారత్ను ఖండఖండాలుగా చేస్తాం. ఆగ్రాకు నిప్పు పెడతాం. దక్కన్ను మండిస్తాం. ఢిల్లీని షేక్ చేస్తాం’ అని లాహోర్లో ప్రేలాపనలు చేశాడు. కశ్మీర్కు విముక్తి కల్పిస్తామని చెప్పాడు. భారత్కు వ్యతిరేకంగా పాక్ ఏటా ఫిబ్రవరి 5న <<19062687>>కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని<<>> నిర్వహిస్తోంది.
News February 6, 2026
బంధాలకు మిడ్లైఫ్ క్రైసిస్ ముప్పు

40ఏళ్ల తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత దంపతుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News February 6, 2026
FLASH: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,360 పెరిగి రూ.1,53,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 ఎగబాకి రూ.1,40,900 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


