News November 16, 2024
టీమ్ ఇండియాకు షాక్.. కోహ్లీకి గాయం?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందే టీమ్ ఇండియాను గాయాల బెడద వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఆయనను స్కానింగ్కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా మోచేతి గాయాల బారిన పడ్డట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు అందుబాటులో లేకపోయినా భారత్కు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.
Similar News
News April 18, 2026
చర్చకు సిద్ధమా? పవన్కు ప్రకాశ్రాజ్ సవాల్

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని AP D.CM <<19679100>>పవన్<<>> చేసిన ట్వీట్పై ప్రకాశ్రాజ్ స్పందించారు. ‘మోదీని మెప్పించేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి. ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడూ ఆమోదించవచ్చు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది. దీనిపై డిబేట్కు సిద్ధమా’ అని సవాల్ విసిరారు.
News April 18, 2026
B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
News April 18, 2026
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.


