News November 16, 2024

విజయవాడలో భారీ సైబర్ మోసం.. రూ.1,25,10,000 మాయం

image

విజయవాడలో భారీ మోసం వెలుగు చూసింది. విజయవాడకు చెందిన నర్ర నాగశ్రీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్) అనే మహిళకు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల నుంచి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. భయపడిన ఆమె వెంటనే తన అకౌంట్లో రూ.కోటీ పాతిక లక్షల పదివేల నగదును సైబర్ నేరగాళ్ల ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇది మోసం అని తెలుసుకున్న బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News July 10, 2025

గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్‌కి తల్లి వినతి

image

ఉద్యోగాల కోసం ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న తన ఇద్దరి కుమారులను రక్షించాలంటూ సూర్యకుమారి Dy.CM పవన్‌ని గన్నవరం ఎయిర్‌పోర్టులో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, విదేశాల్లో ఉన్నవారిని తిరిగి రప్పిస్తానని అన్నారు.

News July 10, 2025

మచిలీపట్నం: 11న ‘వార్తాలాప్’ జర్నలిస్ట్‌లకు వర్క్‌ షాప్

image

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మచిలీపట్నంలో జర్నలిస్టులకు ‘వార్తాలాప్’ మీడియా వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు PIB డైరెక్టర్ రత్నాకర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వలందపాలెంలోని G కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ వర్క్ షాప్‌కు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ వర్క్ షాప్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News July 10, 2025

కృష్ణా: గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు

image

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలజీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.