News November 16, 2024

విజయనగరం మాజీ ఎంపీకి కీలక బాధ్యతలు

image

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జోగారావుకి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌తో అండగా ఉంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.

Similar News

News September 30, 2025

హోంమంత్రి అనితతో పైడితల్లమ్మ దేవస్థాన ఈఓ భేటీ

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్, హోం మంత్రి వంగలపూడి అనితను విజయనగరం శ్రీపైడితల్లి దేవస్థానం ఈవో, సహాయ కమిషనర్ శిరీష విశాఖలోని హోం మంత్రి ఆఫీసులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 7న జరగనున్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీపైడితల్లమ్మ సినిమానోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఉత్సవ ఏర్పాట్లను అనితకు వివరించారు.

News September 30, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి సమీక్ష

image

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి దత్తి గ్రామంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన దాదాపు రోజంతా గ్రామంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, JC సేధు మాధవన్ పాల్గొన్నారు.

News September 29, 2025

VZM: పాల ప్యాకెట్ ధర తగ్గిందా?

image

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని పలు డెయిరీ యాజమాన్యాలు ప్రకటించాయి. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ పాల ఉత్పత్తుల <<17788908>>ధరలు తగ్గనున్నాయని<<>> తెలిపింది. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుందని వెల్లడించింది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42 వరకు తగ్గుతాయని చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో రేట్లు తగ్గాయా కామెంట్ చెయ్యండి.