News November 16, 2024

స్కూళ్లపై కీలక నిర్ణయం

image

AP: 2025-26 నుంచి ప్రాథమికోన్నత పాఠశాల విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30మంది విద్యార్థుల కంటే తక్కువుంటే ప్రైమరీ, 60కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నతపాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్‌లో 20మందిలోపు పిల్లలుంటే ఒక SGT, 60మందికి 2 SGT, ఆ పైన ప్రతి 30మందికి అదనంగా ఒక SGTని, ఆదర్శ స్కూల్‌లో ప్రతి తరగతికి ఓ SGTని కేటాయిస్తుంది.

Similar News

News December 26, 2025

ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

image

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.

News December 26, 2025

డీలిమిటేషన్‌: GHMCలో కొత్తగా 6 జోన్లు

image

TG: GHMC డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లను కొత్త జోన్లుగా పేర్కొంది.

News December 26, 2025

మతపరమైన గొడవ కాదు.. అతడో క్రిమినల్: బంగ్లా సర్కార్

image

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు <<18670618>>అమృత్ మండల్<<>> హత్యకు గురికావడంపై అక్కడి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘ఇది మతపరంగా జరిగిన ఘర్షణ కాదు. అమృత్ మండల్ ఓ టాప్ క్రిమినల్. అతను ఓ ఏరియాలో డబ్బులు డిమాండ్ చేసేందుకు రాగా స్థానికులతో జరిగిన గొడవలో చనిపోయాడు’ అని పేర్కొంది. కాగా దీపూ చంద్రదాస్ హత్య తర్వాత మరో హిందూ హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.