News November 16, 2024

ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించిన తిరుపతి RPF

image

రైల్వే రక్షణ దళం (RPF) ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించింది. శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో RPF, GRP భద్రతా బలగాలు లగేజ్ కౌంటర్లు, పార్శిల్ ఆఫీస్, ప్లాట్‌ఫారమ్‌ల పై విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో ఆర్పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం ప్లాట్‌ఫారంపై నిర్లక్ష్యంగా వదిలిపెట్టబడిన ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్‌లలో నిషేధిత గంజాయిని గుర్తించింది. దీని విలువ సుమారు రూ.3,78,100 ఉంటుంది.

Similar News

News May 8, 2025

మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యే థామస్ భేటీ

image

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.

News May 7, 2025

28న చిత్తూరులో జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

News May 7, 2025

సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు 

image

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.