News November 16, 2024
సకుటుంబ సర్వేను పరిశీలించిన HYD కలెక్టర్

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని HYD జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం బేగంపేట్లోని మయూరి మార్గ్లో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమయ్య, ఎన్యుమరేటర్లతో మాట్లాడి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అన్ని వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.
Similar News
News March 6, 2026
గచ్చిబౌలి: గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి గాయాలు

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో శుక్రవారం గ్యాస్ బెలూన్ పేలి నలుగురు గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News March 6, 2026
HYD: ఫైల్ కదలాలంటే సమర్పించుకోవాల్సిందే..!

సికింద్రాబాద్ GHMC ఆఫీసులో అకౌంట్స్ ఎగ్జామినర్ సంతోష్ ఓ పెన్షనర్ దగ్గర రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. కాగా ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఇంజినీరింగ్ విభాగంలో 30శాతం కమీషన్ల దందా నడుస్తోందనే ఆరోపణలున్నా కేవలం చిన్న క్లర్కులను పట్టుకొని హడావిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వందల కోట్ల ఆస్తులు వెనకేసిన పెద్ద ఆఫీసర్ల ఫైళ్లు మాత్రం బీరువాల్లోనే మగ్గుతున్నాయి.
News March 6, 2026
HYD: ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా.. జాగ్రత్త..!

HYDవాసులను జలమండలి బిల్లుల కంటే కేటుగాళ్ల మెసేజ్లే ఎక్కువ భయపెడుతున్నాయి. బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ HMWSSBపై ఫేక్ లింకులు పంపిస్తున్నారు. తెలీక ఆ లింక్ నొక్కితే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే సిటీలో రూ.కోట్లు కాజేసినట్లు సమాచారం. డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మాత్రం మేము అలాంటి మెసేజ్లే పంపమని చేతులు దులుపుకుంటున్నారు. కాగా, కస్టమర్ల వివరాలు బయటకెలా వెళ్తున్నాయో మాత్రం తెల్వట్లేదు.


