News November 16, 2024
నీటిని పీల్చుకునే ‘ట్రోవాంట్స్’ రాళ్లు!

యూరప్లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ట్రోవాంట్స్’ అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. అప్పటివరకూ సాధారణ శిలల్లా కనిపించే ఈ భౌగోళిక అద్భుతాలు వర్షపు నీటిని పీల్చుకుని పరిమాణాన్ని పెంచుకుంటాయి. అచ్చం జీవిలానే ప్రవర్తిస్తాయి. ఈ దృగ్విషయం స్థానికులు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
Similar News
News September 16, 2025
అనంత్ అంబానీ ‘వనతారా’కు సిట్ క్లీన్ చిట్

అనంత్ అంబానీ గుజరాత్లో స్థాపించిన ‘వనతారా’ జంతు సంరక్షణ కేంద్రానికి SCలో ఊరట లభించింది. వనతారాకు విదేశాల నుంచి ఏనుగుల తరలింపుపై దాఖలైన పిల్ను విచారించి కొట్టేసింది. సిట్ వనతారాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఏనుగులను తరలిస్తే అందులో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. ఏనుగులను యజమానులకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
News September 16, 2025
నేడు భారీ వర్షాలు

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అటు TGలో వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని IMD తెలిపింది.
News September 16, 2025
మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.