News November 17, 2024
కన్నడ నేర్చుకోవాల్సిందే: ZOHO CEO

బెంగళూరులో నివసించే ఇతర రాష్ట్రాల వారు కచ్చితంగా కన్నడ నేర్చుకోవాలని ZOHO CEO శ్రీధర్ వేంబు వ్యాఖ్యానించారు. భాష నేర్చుకోకపోతే అది స్థానికతను అగౌరవపరచడమే అవుతుందన్నారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. రోజూ వెయ్యి పనులు చేయాల్సిన పరిస్థితిలో ఏదైనా కొత్తగా నేర్చుకొనే విధానం ఆర్గానిక్గా ఉండాలని ఒకరు, చుట్టూ 90% ఇతర రాష్ట్రాల వారే ఉంటే కొత్త భాష ఎలా సాధ్యమంటూ మరొకరు పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి

తెలంగాణలో నలుగురు IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. NVS రెడ్డిని HMRL ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ, SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యలకు అదనపు బాధ్యతలిస్తూ నిర్ణయించింది. పూర్తి వివరాలకు <
News September 16, 2025
కడియం శ్రీహరి దారెటు? రాజీనామా చేస్తారా?

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్కు MLA కడియం శ్రీహరి ఇంకా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇతర ఎమ్మెల్యేల తరహాలో BRSలోనే ఉన్నానని సమాధానం ఇస్తారా? రాజీనామా చేసి ఉపఎన్నికలో మళ్లీ గెలిచి విమర్శకుల నోరు మూయించాలనే యోచనలో ఉన్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే తనకు చివరి ఎన్నికలని గతంలో ప్రకటించిన ఆయన ఇప్పుడు రిస్క్ ఎందుకు అనుకుంటారా అనేది చూడాలి.
News September 16, 2025
OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.