News November 17, 2024
బీజింగ్లో చేసినట్లే ఢిల్లీలో చేయండి: నెటిజన్లు

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిపోతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యం తగ్గట్లేదు. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్లో పన్నెండేళ్లలో తగ్గిపోయిన కాలుష్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అక్కడ 2012లో కాలుష్యంతో నిండిపోయి పొగ కమ్మేయగా.. ఇప్పుడు గాలి నాణ్యత పూర్తిగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News January 12, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

* ముల్తానీ మట్టి, రోజ్వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
* పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 12, 2026
మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.


