News November 18, 2024
బయటకొస్తున్న DRM ఆస్తుల చిట్టా

AP: లంచం తీసుకుంటూ <<14636570>>సీబీఐకి<<>> పట్టుబడిన విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ ఆస్తుల చిట్టా బయటకొస్తోంది. ఇప్పటివరకు సౌరభ్కు చెందిన రూ.87.6 లక్షల ఆస్తులను సీబీఐ జప్తు చేసింది. రూ.72లక్షల విలువైన బంగారం, ఆస్తుల పత్రాలను సీజ్ చేసింది. ముంబైలోని అపార్ట్మెంట్లో లాకర్ను సీబీఐ అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News December 27, 2025
‘పాలమూరు-రంగారెడ్డి’ని సందర్శించనున్న KCR!

TG: అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
సరిగ్గా నిద్ర పోవట్లేదా..?

నైట్ ఔట్లు, సినిమాలు, షికార్లు అంటూ కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు జాబ్ వల్ల సరైన నిద్రలేక అవస్థలు పడుతుంటారు. కారణమేదైనా రోజుకు కనీసం 7గం. నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సినంత నిద్ర, విశ్రాంతి లభించకపోతే బోలెడు వ్యాధులు చుట్టుముడతాయి. బీపీ, షుగర్, డిప్రెషన్, ఊబకాయంతో పాటు హార్ట్స్ట్రోక్, గుండె జబ్బులు కూడా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ShareIt.
News December 27, 2025
పరకామణి కేసు.. HCకి ఏసీబీ మధ్యంతర నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఇవాళ హైకోర్టుకు మధ్యంతర నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. కేసు పరిస్థితుల ఆధారంగా మరో FIR నమోదు చేయాల్సిన అవసరం ఉందని, సీఐడీ దీన్ని పరిశీలించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.


