News November 18, 2024

ప.గో: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయడానికి వికేంద్రీకరణ చేశామన్నారు. సోమవారం నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వాలన్నారు. ఈ మార్పును గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. 

Similar News

News November 12, 2025

ఇరగవరం: గృహ హింస కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష

image

గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో ఇరగవరం (M) రేలంగికి చెందిన బాదంపూడి శ్రీనివాస్‌కు సంవత్సర కాలంతో పాటు అదనంగా 3 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ, రూ. 4500ల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. 2021 MARలో భార్య సునీత రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై అప్పటి SI సతీష్ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ పూర్తి కాగా న్యాయమూర్తి పీవీ నాగ రంజిత్ కుమార్ తుది తీర్పును వెల్లడించారు.

News November 12, 2025

తాడేపల్లిగూడెం: గడ్డి మందు తాగి..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

తాడేపల్లిగూడెం (M) ఎల్. అగ్రహారంలో నివసిస్తున్న ముప్పడి కార్తీక్ (37) గడ్డి మందు తాగి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఉద్యోగం లేకపోవడంతో మద్యానికి బానిసై ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి ఇంటి ముందు దొరికిన గడ్డి మందు తాగినట్లు అతని భార్య సునీత రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 12, 2025

ఒక్కొక్క టీమ్ రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేయాలి: జేసీ

image

జిల్లాలో ఉండి, వీరవాసరం, నరసాపురం, యలమంచిలి మండలాల్లో ఒక్కొక్క టీం రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేసేలా ఆర్డీవోలు మండల సర్వేలు తహసీల్దార్లు పర్యవేక్షించాలని జేసి రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడారు. రైతులకు నోటీసులిచ్చి డాక్యుమెంట్లు పరిశీలించే సర్వే పూర్తి చేయాలన్నారు. రీ సర్వే ఫేస్ 2లో జున్నూరు, మార్టేరు గ్రామాలు రికార్డును సమర్పించాలని ఆదేశించారు.