News November 18, 2024
నెల్లూరు: లా విద్యార్థిని సూసైడ్

కోవూరులో ఓ లా విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోవూరుకు చెందిన లాయర్ శ్రీనివాసులు కుమార్తె శ్రీలత(25) నెల్లూరులో లా చదువుతోంది. శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కోవూరు SI రంగనాథ్ గౌడ్ తెలిపారు.
Similar News
News October 28, 2025
నెల్లూరులో విద్యార్థుల మిస్సింగ్.. గూడూరులో ప్రత్యక్షం

ధనలక్ష్మిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న రాకేష్, లోకేష్ ఈ నెల 23న అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. వారిద్దరూ గూడూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లిన ఆ ఇద్దరు విద్యార్థులు గూడూరులో ఉండగా.. సాంకేతికత ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు.
News October 28, 2025
భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఇవే.!

☞ నెల్లూరు కలెక్టరేట్: 086102331261, 7995576699
☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు- 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు- 9100948215
☞ కావలి RDO ఆఫీసు-7702267559
☞ రాష్ట్ర టోల్ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101.
☞ జిల్లా యాంత్రాంగం తుఫాన్ ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంది.
News October 28, 2025
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు


