News November 18, 2024

హిజ్రాల ఆగడాలకు బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

image

మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రయాణికుల నుంచి హిజ్రాలు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రానికి తరలివస్తున్న భక్తుల వాహనాలను ఆపి, 4 చక్రాల వాహనదారుల నుంచి రూ.500, బైకు చోదకుల నుంచి రూ.100 డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.

Similar News

News November 7, 2025

SUPER.. కర్నూలు ప్రిన్సిపల్‌కు 43 అవార్డులు

image

కర్నూలు బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నాగస్వామి నాయక్ విద్యా, సేవా రంగాల్లో చేసిన విశిష్ఠ కృషికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO) ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ అవార్డును గురువారం కర్నూలు ఎంపీ నాగరాజు చేతుల మీదుగా స్వీకరించారు. నాయక్ ఇప్పటివరకు 43 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కళాశాల ఉత్తీర్ణత శాతం 82.08% సాధించడంలో కీలక పాత్ర వహించారు.

News November 7, 2025

విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

image

ఆటోలు కళాశాలల స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టంచేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, రోడ్ల వెంట ఆటోలను నిలపడం, మద్యం తాగి వాహనాలు నడిపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News November 6, 2025

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సిద్ధం కావాలి: చీఫ్ ఎలక్టోరల్ అధికారి

image

కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా లోపరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి, అధికారులు పాల్గొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్‌లుగా నమోదు చేయాలన్నారు. డూప్లికెట్, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.