News November 18, 2024
Stock Market: బేర్స్ జోరు.. బుల్స్ బేజారు

స్టాక్ మార్కెట్లు మార్నింగ్ సెషన్లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మొదటి అరగంట పాటు బెంచ్ మార్క్ సూచీలు రిట్రేస్మెంట్ అవ్వకుండా నష్టాలవైపు పయనించాయి. అయితే సెన్సెక్స్ 77,000 పరిధిలో, నిఫ్టీ 23,350 పరిధిలో ఇప్పటికే రెండు సార్లు సపోర్టు తీసుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల నష్టంతో 77,127 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 23,401 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Similar News
News February 1, 2026
KCRతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

TG: సిట్ విచారణ అనంతరం BRS అధినేత KCRతో కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు భేటీ అయ్యారు. విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై చర్చిస్తున్నారు. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు BRS భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు KCR రాకకోసం వేచిచూస్తున్నారు.
News February 1, 2026
సెమీస్కు భారత్! పాక్ గెలిచినా ఇంటికే..

U19 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని <<19023246>>33.3<<>> ఓవర్లలోపు ఛేదించడంలో పాక్ విఫలమైంది. ఆ సమయానికి కేవలం 167/4 రన్స్ మాత్రమే చేయడంతో రన్రేట్ సమీకరణాల ప్రకారం భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ జట్టు గెలుపు కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ పాక్ గెలిస్తే ఇండియా ఎల్లుండి ఆసీస్తో, ఓడితే FEB 4న ఆఫ్గాన్తో సెమీఫైనల్లో తలపడనుంది.
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్పై ఆదేశాలు ఇవ్వలేదు: KCR

TG: ఫోన్ ట్యాపింగ్పై తాను ఆదేశాలు ఇవ్వలేదని KCR సిట్ విచారణలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై GOVTకి నివేదించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్కు ఉంటుంది. MLAల కొనుగోలు సమాచారం అలాగే వచ్చింది. అదెలా సేకరించారో CMకు అవసరం లేదు కదా? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది.


