News November 18, 2024
BREAKING: దోర్నాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు సమీపంలో గల వెలిగొండ ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న తల్లి, కూతురు లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైకు నడుపుతున్న భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News April 19, 2026
పరిష్కార వేదిక సమయంలో మార్పులు: DRO

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.
News April 19, 2026
ప్రకాశం ఎస్పీ హెచ్చరికలు ఇవే..!

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
News April 19, 2026
ప్రకాశం జిల్లాలో ఈ గుడికి వెళ్లారా..?

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ తల్లి చాలా పవర్ ఫుల్. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారి గర్భాలయం వెనుక వైపు రూపాయి కాయిన్ నిలెట్టి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఆది, మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ వెండి కిరీటం, బంతి, మల్లె, గులాబీ పూలతో అమ్మవారిని(పైఫొటో) అలంకరించారు. మీరు ఈ గుడికి వెళ్లారా?


