News November 18, 2024

3Hrs నిలబెట్టి 15 మంది ర్యాగింగ్.. విద్యార్థి మృతి

image

గుజరాత్‌లోని ధార్పూర్ GMERS మెడికల్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. థర్డ్ ఇయర్ సీనియర్స్ 15 మంది ఇంట్రో పేరుతో ఫస్ట్ఇయర్ స్టూడెంట్‌ అనిల్ మెథానియాను ర్యాగింగ్ చేశారు. ఏకధాటిగా 3 గంటలు నిలబెట్టారు. దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 3 గంటలు నిలబెట్టిన విషయాన్ని పోలీసులు రికార్డు చేసుకున్న కాసేపటికే అతడు మరణించడం సంచలనంగా మారింది. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.

News September 18, 2025

మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

image

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్‌ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.