News November 18, 2024

SKLM: పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి (DEO) తిరుమల చైతన్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 02, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 9, రూ.500 రుసుంతో డిసెంబర్ 16 ఆఖరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 27, 2026

SKLM: డయేరియా ప్రాంతంలో కఠిన నిబంధనలు

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ గురువారం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంగువారితోట దమ్మలవీధి కాకివీధి మేదరివీధి ప్రాంతాల్లో డయేరియా అదుపులోకి వచ్చినంత వరకు మాంసం విక్రయాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 27, 2026

శ్రీకాకుళం: డయేరియాపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురికి కాలువల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.