News November 18, 2024
USలో చైనాను బీట్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్

అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.
Similar News
News January 10, 2026
మెడ నలుపు తగ్గాలంటే?

హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి ఈ చిట్కాలు. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేయాలి. దీన్ని 20నిమిషాల తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్, కాఫీపొడి, పసుపు కలిపి మెడకి రాసి, ఆరాక నీటితో స్క్రబ్ చేయాలి. మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 10, 2026
నేడు ఇవి దానం చేస్తే?

పుష్య మాస శనివారాల్లో చేసే దానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. చలి తీవ్రంగా ఉండే ఈ మాసంలో పేదలకు కంబళ్లు, దుప్పట్లు, వస్త్రాలను దానం చేయాలి. ఇవేకాక నల్ల నువ్వులు, బెల్లం, నూనె దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పవిత్ర మాసంలో స్నాన, జప, తపాదులతో పాటు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. పరులకు చేసే సాయమే దేవుడికి చేరే నిజమైన పూజ.
News January 10, 2026
పెరుగుతున్న చలి.. వణుకుతున్న జనం

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రెండు మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. TGలో 14 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.6 డిగ్రీలుగా ఉంది. అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. నిన్న రాత్రి పాడేరులో 4.1, పెదబయలు 4.8, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


