News November 19, 2024
కెరమెరి: సరిహద్దు గ్రామాల్లో ముగిసిన ప్రచారం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలంలోని రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాస్పద గ్రామాలు పరందోలి, అంతాపూర్, ఇంద్రనగర్, మహారాజ్ గుడ్డతో పాటు సరిహద్దులో గల 12 గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా వారు రాజురా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకుంటారు. వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఇద్దరు చొప్పున ప్రజాప్రతినిధులు ఉంటారు.
Similar News
News July 6, 2025
ADB: యువతులను వేధిస్తున్న యువకుడిపై కేసు

యువతులు, మహిళలను వేధిస్తున్న యువకుడి పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనీస్ అనే యువకుడు స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న మహిళలు, యువతులను వేధించడంతో అతనిపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సమాచారం అందుకున్న షీటీం సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
ADB: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు HYDలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కొరకు
https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ADB బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
News July 5, 2025
సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ADB ఎస్పీ

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన పరేడ్లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు.