News November 19, 2024

VZM: ‘చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి’

image

విజయనగరం జిల్లాలోని వాగులు గెడ్డలపై చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు వారం రోజుల్లోగా ప్రతిపాదనలు సమర్పించాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం ఆ శాఖ ఇంజినీర్లతో తన కార్యాలయంలో సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న భూముల్లో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టుల మరమ్మతులు నిర్వహణ పనుల కోసం మంజూరైన నిధుల వివరాలు చెప్పాలన్నారు.

Similar News

News September 30, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి సమీక్ష

image

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి దత్తి గ్రామంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన దాదాపు రోజంతా గ్రామంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, JC సేధు మాధవన్ పాల్గొన్నారు.

News September 29, 2025

VZM: పాల ప్యాకెట్ ధర తగ్గిందా?

image

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని పలు డెయిరీ యాజమాన్యాలు ప్రకటించాయి. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ పాల ఉత్పత్తుల <<17788908>>ధరలు తగ్గనున్నాయని<<>> తెలిపింది. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుందని వెల్లడించింది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42 వరకు తగ్గుతాయని చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో రేట్లు తగ్గాయా కామెంట్ చెయ్యండి.

News September 29, 2025

VZM: కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో కూడా వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.