News November 19, 2024
రూ.100 కోట్ల సైబర్ ఫ్రాడ్స్టర్ అరెస్ట్: APతో లింక్

వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్లకు పాల్పడ్డ చైనా పౌరుడు ఫాంగ్ చెంజిన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.43.5 లక్షల మోసం కేసులో దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అతడి స్కామ్ల విలువ రూ.100 కోట్లు దాటేసినట్టు కనుగొన్నారు. ముఖ్యంగా AP, UPల్లో సైబర్ క్రైమ్స్, మనీలాండరింగ్కు పాల్పడినట్టు గుర్తించారు. CCPలో అతడిపై నమోదైన 17 కేసులు ఫిన్కేర్ బ్యాంక్ A/Cకు లింకైనట్టు తెలిపారు.
Similar News
News January 14, 2026
భోగి వేడుకల్లో చంద్రబాబు ఫ్యామిలీ

AP: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. హరిదాసుల భక్తి కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలను సీఎం వీక్షించారు. ఈ విషయాన్ని ఆయన కోడలు, మంత్రి లోకేశ్ భార్య బ్రాహ్మిణి Xలో పోస్ట్ చేశారు. మన సంప్రదాయాలు, సంస్కృతి మూలాలకు ఇది చిహ్నం అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో నారా రోహిత్ ఫ్యామిలీ, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2026
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఇలా చేయండి

పిల్లల్ని కనడం అనేది చాలా మంది మహిళల కల. దీని కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ D, C స్థాయిలు సరిగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. 3 నెలల ముందునుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
News January 14, 2026
పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్కు ₹1.80 కోట్ల పరిహారం

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.


