News November 19, 2024
లగచర్ల దాడి నిందితుడికి 14 రోజుల రిమాండ్

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ప్రధాన నిందితుడు సురేశ్కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను కొడంగల్ నుంచి సంగారెడ్డి జైలుకు తరలించనున్నారు. లగచర్ల దాడి కేసులో A2గా ఉన్న సురేశ్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. A1 పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
Similar News
News September 15, 2025
భారీగా తగ్గిన స్విఫ్ట్ కారు ధర

GST సంస్కరణల నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కారు ధర వేరియంట్స్ను బట్టి రూ.55 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.06లక్షల వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్(ఎక్స్ షోరూం) రూ.5.94 లక్షలకు చేరింది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ.2.77 లక్షలు, ఎస్-ప్రెస్సో రేట్ రూ.3.90 లక్షలు, వాగన్R ధర రూ.5.26 లక్షలు, డిజైర్ రేట్ రూ.6.24 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
News September 15, 2025
ఏపీలో ఐఏఎస్ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News September 15, 2025
బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.