News November 19, 2024
ఏపీలో మరో 4 కార్పొరేషన్లు ఏర్పాటు

AP: యాదవ, గౌడ, మాల, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు వాటికి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కార్పొరేషన్కు 15 మంది చొప్పున 60 మంది సభ్యులను నియమించింది. ప్రతి కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించింది.
Similar News
News November 15, 2025
బాలికకు 100 సిట్ అప్స్ శిక్ష.. మృతి

నిన్న బాలల దినోత్సవం రోజునే మహారాష్ట్రలోని వాసాయిలో దారుణం జరిగింది. స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని కాజల్ అనే ఆరోతరగతి చిన్నారికి టీచర్ 100 సిట్ అప్స్ పనిష్మెంట్ విధించింది. అవన్నీ పూర్తి చేసిన బాలిక తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. ఇంటికి చేరుకోగానే ఆరోగ్యం క్షీణించింది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News November 15, 2025
గత 6ఏళ్లలో FDIల సాధనలో AP వెనుకబాటు

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సాధనలో 2019 OCT-2025 JUN మధ్య కాలంలో AP బాగా వెనుకబడింది. ఆ కాలంలో $1.27B FDIలతో ఏపీ 14వ స్థానానికి పరిమితమైంది. దేశ FDIలలో ఏపీ వాటా 0.2%-0.7% కాగా కర్ణాటక 14%-28% TN 3.7%-10% దక్కించుకున్నట్లు బిజినెస్ టుడే పేర్కొంది. 2025 జూన్ క్వార్టర్లో AP $307 M, కర్ణాటక $10 B, TG $2.3 B FDIలు సాధించాయి. కాగా VSP CII సమ్మిట్లో వచ్చిన 13L CR పెట్టుబడుల్లో FDIలూ ఉన్నాయి.
News November 15, 2025
Where is my Train యాప్ సృష్టికర్త ఇతడే!

ఒకప్పుడు రైలు ఎక్కడుందో తెలియక స్టేషన్లలోనే గంటల తరబడి ఎదురుచూసేవాళ్లం. కానీ ‘Where is my Train’ యాప్ వచ్చాక లైవ్ స్టేటస్ను తెలుసుకోగలుగుతున్నాం. ‘సిగ్మాయిడ్ ల్యాబ్స్’ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్ను 2018లో గూగుల్ కొనుగోలు చేసింది. అహ్మద్ నిజాం మొహైదీన్ తన టీమ్తో కలిసి ఈ యాప్ను అభివృద్ధి చేశారు. సాధారణ సమస్యను పరిష్కరించడంతో ఈ కంపెనీ విలువ ₹320 కోట్లు దాటింది. మీరూ ఈ యాప్ వాడతారా?


