News November 20, 2024

నిర్మల్: ప్రజావిజయోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాది పూర్తైన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కళాకారుల బృందం ఆధ్వర్యంలో ఈనెల 21న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News February 16, 2026

ఆదిలాబాద్‌ బల్దియాలో అరుదైన దృశ్యం

image

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పక్కపక్క వార్డుల అభ్యర్థులే అత్యున్నత పదవులను కైవసం చేసుకోవడం విశేషం. చైర్‌పర్సన్‌గా 45వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష, వైస్ చైర్మన్‌గా 44వ వార్డు సభ్యుడు మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. వరుస సంఖ్య గల వార్డులకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ బల్దియాలో బీజేపీకి భంగపాటు

image

ఆదిలాబాద్‌‌లో కమలదళానికి గట్టి షాక్ తగిలింది. 21మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు, చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వడంతో పీఠం చేజారిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి.

News February 16, 2026

ఆదిలాబాద్‌ వైస్ ఛైర్మన్‌గా ఎండీ రోహిత్

image

ఆదిలాబాద్‌ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు కౌన్సిలర్ ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో రోహిత్‌కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఛైర్‌పర్సన్ ఎన్నిక తరహాలోనే వైస్ ఛైర్మన్ ఎంపికలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో రోహిత్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.