News November 20, 2024

అమరావతి: అమరేశ్వర స్వామి ఆలయంలో కనిపించిన పాములు

image

అమరావతిలోని అమరేశ్వర స్వామి దేవస్థానంలోని ఉపాలయమైన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో రెండు పాములు కనిపించాయి. మంగళవారం అర్చక స్వాములు అభిషేకం చేయటానికి వచ్చి ఆలయ తలుపులు తీయడంతో పాములు దర్శనమిచ్చాయి. దీంతో పూజారి పాములు పట్టే వారిని పిలవగా వచ్చేసరికి అవి కనిపించలేదు. అనంతరం స్వామివారికి పూజారులు పంచామృతాభిషేకాలు జరిపి విశేష అలంకరణ చేపట్టారు.

Similar News

News April 18, 2026

చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

image

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.

News April 18, 2026

GNT: ఎండలు బాబోయ్.. ఉక్కబోతతో జనం ఉక్కిరి బిక్కిరి

image

గుంటూరు జిల్లాలో ఎండ‌లు మండిపోతున్నాయి. రోజు రోజుకీ సూర్య‌ప్ర‌తాపం పెరిగిపోతూ రికార్డు స్ధాయి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. వారం రోజులుగా ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉంటోంది. శనివారం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఎండ‌ల ధాటికి ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు రావడానికే భయపడి పోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి.

News April 18, 2026

GNT: CRDA గ్రీవెన్స్ డే మార్పు

image

రాజధాని అమరావతి రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడి APCRDA కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే ఇకపై ప్రతి సోమవారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కమిషనర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. గతంలో శనివారం నిర్వహించగా మార్పు చేశారు. రాయపూడి CRDAలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ వద్ద రోజువారీగా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.