News November 20, 2024

HYD: తగ్గిన ఫిర్యాదులు.. లెక్కలు ఇవే..!

image

గ్రేటర్ HYDలో డివిజన్లలో సెప్టెంబర్లో వినియోగదారుల ఇంటి వద్ద చోకేజీ సమస్యలు 12,105 జలమండలి దృష్టికి వచ్చాయి. అదే అక్టోబర్లో 9,697 నమోదై, గత నెలతో పోలిస్తే 2,408 ఫిర్యాదులు తగ్గాయి. అంటే 20% ఫిర్యాదులు తగ్గాయి. సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు సెప్టెంబర్లో 30,105 నమోదు కాగా, అక్టోబర్లో 23,293 నమోదై. గత నెలతో పోలిస్తే 6,812 ఫిర్యాదులు తగ్గాయి. అంటే 23% ఫిర్యాదులు తగ్గినట్లు రిపోర్ట్ వెల్లడించింది.

Similar News

News January 6, 2026

రంగారెడ్డిలో ‘పేదోడి విందు’ కొండెక్కింది

image

పేదోడి విందైన చికెన్ ధర కొండెక్కడంతో RRజిల్లాలో చికెన్ ప్రియులకు షాక్ తగిలి బెంబేలు ఎత్తుతున్నారు. న్యూ ఇయర్ ప్రారంభంలోనే కిలో చికెన్ ధర త్రిబుల్ సెంచరీకి చేరింది. గత కొన్ని రోజులుగా రూ.200- 250 ఉన్న ధర అమాంతం పెరగడంతో వచ్చే పండుగ ఎలా చేసుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఫారం ధర రూ.180 పలుకుతోంది. వినియోగం పెరిగి, కోళ్ల పెంపకం తగ్గడమే ధర పెరగుదలకు కారణమని ఫారం యజమానులు చెబుతున్నారు.

News January 5, 2026

మొయినాబాద్: 8 నెలలుగా మ్యాథ్య్ టీచర్ లేక 10th విద్యార్థుల ఆందోళన

image

మొయినాబాద్‌లోని హిమాయత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో 8 నెలలుగా గణిత బోధించకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారు. సిలబస్ పూర్తి కాకుండానే 10వ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు హిమాయత్‌నగర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బురకాయల రమేశ్ 10వ తరగతి విద్యార్థులను సందర్శించి, MEOతో మాట్లాడి ఉపాధ్యాయుని నియమిస్తానని హామీ ఇచ్చారు.

News January 5, 2026

RR: గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేశారా?

image

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నూతన, 6- 9 తరగతుల వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు శంషాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఈ నెల 21లోపు కుల,ఆదాయం, బర్త్ సర్టిఫికెట్, 2 ఫొటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.