News November 20, 2024
WGL: అన్నదాతలకు ఊరట.. రూ.80 పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు నేడు రైతులకు స్వల్ప ఊరట నిచ్చాయి. సోమవారం రూ.6,750 పలికిన క్వింటా కొత్త పత్తి ధర.. మంగళవారం రూ.6,730కి చేరింది. ఈ క్రమంలో నేడు రూ.6,810 పలకడంతో అన్నదాతలకు స్వల్ప ఊరట లభించినట్లు అయింది. అయితే సిసిఐ నిర్దేశించిన ధరకు కొనుగోలు జరగడం లేదని రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 21, 2026
గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: వరంగల్ కలెక్టర్

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
News January 21, 2026
వరంగల్: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని ఐదు మైనారిటీ గురుకులాల్లో (ఆంగ్ల మాధ్యమం) 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ) కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
News January 20, 2026
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

జిల్లాలో ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో ఓటు ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు.


