News November 20, 2024

గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా మారుస్తాం: CM రేవంత్

image

TG: కుల సర్వేతో మిమ్మల్ని గర్వించేలా చేయడం మరింత శక్తినిస్తుందంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ CM రేవంత్ ట్వీట్ చేశారు. ‘మీ ముందుచూపు, ఆలోచనలు, పని నుంచే మేం ప్రేరణ పొందాం. మీ వాగ్దానాలకు అనుగుణంగా TG గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా, మార్గదర్శకంగా మారుస్తాం’ అని CM పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని రాహుల్ రాసిన లేఖకు స్పందనగా రేవంత్ ఈ ట్వీట్ చేశారు.

Similar News

News January 13, 2026

ముగ్గు వేస్తే ఆరోగ్యం..

image

ఉదయాన్నే ముగ్గు వేస్తే మహిళలకు వ్యాయామం అవుతుంది. ఇది వెన్నెముకను దృఢపరుస్తుంది. జీర్ణక్రియను, పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్ల కదలికల వల్ల శరీరానికి చక్కని మసాజ్ అందుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బియ్యప్పిండితో ముగ్గు వేస్తే చీమలు, పిచ్చుకల వంటి జీవులకు ఆహారం లభిస్తుంది. ఈ ప్రాసెస్ ఏకాగ్రతను పెంచే ఒక అద్భుతమైన మెడిటేషన్ వంటిది.

News January 13, 2026

త్వరలో చిరంజీవితో సినిమా చేస్తా: మారుతి

image

త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ‘రాజాసాబ్’ డైరెక్టర్ మారుతి చెప్పారు. ‘‘రాజాసాబ్’ మూవీకి 3 ఏళ్ల కష్టం 3 గంటలు తీసి చూపిస్తే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. త్వరలో వాళ్లే రియలైజ్ అవుతారు. నేనేమీ వారిని శపించట్లేదు. వారిపట్ల బాధ‌పడుతున్నా. రాజాసాబ్ రెండోసారి చూస్తే రైటింగ్‌లో లోతు తెలుసుకుంటారు. అర్థం చేసుకోవాలంటే మరోసారి చూడండి’’ అని మీడియా చిట్ చాట్‌లో అన్నారు.

News January 13, 2026

ఇరాన్ నిరసనల్లో 12 వేల మంది చనిపోయారా?

image

ఇరాన్ నిరసనల్లో 2వేల మంది <<18846903>>చనిపోయారని<<>> వార్తలు వచ్చాయి. కానీ అక్కడి ప్రతిపక్షాలు మాత్రం భద్రతా దళాల కాల్పుల్లో 12వేల మంది చనిపోయారని సంచలన ఆరోపణలు చేశాయి. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద మారణకాండ అని, లెక్కలోకి రాని మరణాలు వందల్లో ఉండొచ్చని Iran International సంస్థ చెప్పింది. ఈనెల 8, 9తేదీల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బాసిజ్ యూనిట్లు చేసిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది.