News November 20, 2024

గుడివాడ: సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై గుడివాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. అనంతరం ఈ పిటిషన్‌ను ఎల్లుండి నవంబర్ 22వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. 

Similar News

News April 17, 2026

కృష్ణా జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 10,15,634 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,93,141 మంది ఉండగా, మహిళలు 5,22,463 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 30 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News April 17, 2026

కృష్ణా జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 10,15,634 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,93,141 మంది ఉండగా, మహిళలు 5,22,463 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 30 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News April 17, 2026

క్రీడాకారులకు ‘శాప్’ అండగా ఉంటుంది: భరణి

image

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్. భరణితో కృష్ణా జిల్లా టైక్వాండో అసోసియేషన్ కోశాధికారి అశ్విని గోగులమూడి, సభ్యురాలు సరితా దేవి శుక్రవారం భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన పారా జాతీయ టైక్వాండో పోటీలలో రాష్ట్ర క్రీడాకారులు ప్రశాంత్, షణ్ముఖ్ సాధించిన విజయాలను వారు ఎండీకి వివరించారు. క్రీడాకారుల ప్రతిభను అభినందించిన భరణి, వారికి శాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.