News November 20, 2024
ఒక్కో బందీకి రూ.42కోట్లిస్తాం: గాజా ప్రజలకు నెతన్యాహు బంపర్ ఆఫర్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా ప్రజలకు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు. హమాస్ చేతిలో బందీలైన తమ పౌరులను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.42కోట్ల ($5M) చొప్పున ఇస్తామని ప్రకటించారు. ‘ఘర్షణ వద్దనుకుంటున్న వారికి నేను చెప్పేదొకటే. బందీలను తీసుకురండి. డబ్బులిచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్షేమంగా పంపించేస్తాం. ఏ దారి ఎంచుకుంటారో మీ ఇష్టం. మేమైతే బందీలను కచ్చితంగా విడిపిస్తాం’ అని గాజా తీరంలో తెలిపారు.
Similar News
News November 15, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(<
News November 15, 2025
బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
News November 15, 2025
స్వామి పుష్కరిణి అని పేరెందుకు వచ్చింది?

తిరుమలలోని స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడానికి ఓ పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. వేంకటాచలంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలన్నింటికీ ఈ పుష్కరిణియే అవతార స్థానం. లోకంలోని తీర్థాలన్నింటిలోనూ దీన్ని స్వామి వంటిదిగా పరిగణిస్తారు. వరాహ, వామన పురాణాల ప్రకారం.. తనలో స్నానం చేసిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించగల శక్తి, పవిత్రతను అందిస్తుందట. అందుకే దీనికి స్వామి పుష్కరిణి అనే పేరు స్థిరపడింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


