News November 20, 2024

ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నిక‌ల సంఘం ఏం చెప్పింది?

image

ఎగ్జిట్ పోల్స్ విష‌యంలో స‌ర్వే సంస్థలకు స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌ర‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం గతంలో వ్యాఖ్యానించింది. ‘ఎన్ని శాంపిల్స్ సేక‌రించారు? ఎక్క‌డ స‌ర్వే చేశారు? ఒక వేళ ఫ‌లితాలు అంచనాలకు విరుద్ధంగా వ‌స్తే సంస్థ‌లు ఎంత‌వ‌ర‌కు బాధ్య‌త తీసుకుంటాయి?’ అని ప్రశ్నించింది. సర్వేలతో త‌మ‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంచ‌నాలు, ఫ‌లితాలు విరుద్ధంగా ఉండడం స‌మ‌స్యకు దారి తీస్తుంద‌ని పేర్కొంది.

Similar News

News April 18, 2026

కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

image

కోచ్ నావల్‌సింగ్‌ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.

News April 18, 2026

జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

image

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>

News April 18, 2026

భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ

image

TG: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి <<19580372>>భూమిపూజ<<>> చేయడం తెలిసిందే.