News November 20, 2024
BREAKING: మాగనూరు: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాదాపుగా 100 మంది విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 30, 2025
మహబూబ్నగర్: ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఎస్పీ డి.జానకి మంగళవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు.
News December 29, 2025
FLASH: పాలమూరులో మరోసారి ఎన్నికలు

మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో
కౌన్సిలర్లు పోలింగ్కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✒మహబూబ్ నగర్- 60 వార్డుల్లో 2,20,334 మంది జనాభా
✒దేవరకద్ర-12, వార్డుల్లో 12,269 మంది
✒భూత్పూర్-10 వార్డుల్లో 13,938 మంది
ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
News December 29, 2025
MBNR:T-20 టోర్నీ.. మన టీం షెడ్డుల్ ఇదే!

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన జి.వెంకటస్వామి మెమోరియల్ “టీ-20 క్రికెట్ లీగ్” లో ఉమ్మడి మహబూబ్ నగర్ క్రికెట్ జట్టు పాల్గొంటుందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు.
✒ఈనెల 29న MBNR- కరీంనగర్
✒ఈ నెల 31న MBNR-HYD
✒Jan 3న MBNR- ఖమ్మం
✒Jan 5న MBNR-RR
✒Jan 6న MBNR- వరంగల్
✒Jan 8న MBNR- అదిలాబాద్
✒Jan 9న MBNR- నల్గొండ
✒Jan 13న MBNR- నిజామాబాద్
✒Jan 15న MBNR- మెదక్


