News November 20, 2024
ఎమ్మెల్యేలకు మంత్రి సవిత విందు

బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. అమరావతిలోని తన నివాసంలో జరిగిన ఈ స్నేహపూర్వక విందుకు కూటమిలోని మహిళా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రుచికరమైన వంటలను వారికి వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ గ్రూప్ ఫొటో దిగారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ముగియనుండటంతో మంత్రి సవిత ఈ ఆతిథ్యం ఇచ్చారు.
Similar News
News March 21, 2026
పరీక్ష వాయిదా: అనంతపురం DEO

రంజాన్ నేపథ్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసిందని డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఆరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 21, 2026
అనంతపురం: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక సూచనలు

అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. ఆలమూరులోని గ్యాస్ గోడౌన్, నగరంలోని పవన్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన ఆయన, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ అందుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల వద్దకు రావద్దని, యధావిధిగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ జరుగుతుందని భరోసా ఇచ్చారు. అవసరానికి మించి అదనపు బుకింగ్లు చేయవద్దన్నారు.
News March 21, 2026
అనంతపురం: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక సూచనలు

అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. ఆలమూరులోని గ్యాస్ గోడౌన్, నగరంలోని పవన్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన ఆయన, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ అందుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల వద్దకు రావద్దని, యధావిధిగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ జరుగుతుందని భరోసా ఇచ్చారు. అవసరానికి మించి అదనపు బుకింగ్లు చేయవద్దన్నారు.


