News November 20, 2024

ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం సీరియస్

image

TG: నారాయణపేట జిల్లాలోని జడ్పీ స్కూల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.

Similar News

News November 9, 2025

15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్‌సిగ్నల్?

image

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్‌(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.

News November 9, 2025

శ్రీవారి తొలి సోపాన మార్గం ‘అలిపిరి’

image

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలి నడకన వెళ్లేందుకు మొదటి మెట్టు అయిన మార్గమే ‘అలిపిరి’ సోపాన మార్గం. ఇది అలిపిరి వద్ద మొదలవుతుంది. పూర్వం కపిలతీర్థం నుంచి కొండదారి ఉండేది. భక్తుల సౌకర్యార్థం మట్లకుమార అనంతరాజు ఈ మార్గాన్ని పునరుద్ధరించి, నిర్మించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ ‘అనంతరాజు’ మార్గం అలిపిరి నుంచే మొదలై, భక్తులకు స్వామి సన్నిధికి చేరేందుకు సరళ దారిని చూపింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 9, 2025

నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.