News November 21, 2024

సీలేరులో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్ సేవలు..!

image

గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరులో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తహశీల్దార్ టీ.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి సీలేరు డ్యామ్ పరిసరాలను పరిశీలించారు. డ్యాంలో సీ ప్లైన్‌కు సంబంధించిన జెట్టి నిర్మాణానికి అనువైన స్థలం కోసం పరిశీలించారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా విశాఖ నుంచి కానీ రాజమండ్రి నుంచి బలిమెల వరకు సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 9, 2025

సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

image

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.

News July 9, 2025

‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

image

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.

News July 9, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

image

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.