News November 21, 2024

కడప జిల్లాలో దారుణ ఘటన

image

కడప జిల్లాలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లి మధ్యలో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళపై దుండగులు రాళ్ళతో దాడి చేసి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News April 19, 2026

తిరుమల శ్రీవారికి ‘రూ.కోటి’ విరాళం ఇస్తే.!

image

☞దాతతోపాటు నలుగురు ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజులు సుపథం ప్రవేశ దర్శనం పొందవచ్చు ☞అంతేకాకుండా 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట-1, రవికె-1, మహాప్రసాదం ప్యాకెట్లు-10, ఒకసారి వేద ఆశీర్వచనం పొందవచ్చు ☞వీటితోపాటు రూ.3 వేల విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు ☞జీవిత కాలంలో ఒకసారి దాత 5గ్రా. శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రా.సిల్వర్ డాలర్ పొందవచ్చు.

News April 19, 2026

కడప కలెక్టరేట్ వద్ద మాస్టార్ల ధర్నా.!

image

కడప కలెక్టరేట్ వద్ద శనివారం APTF ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డెక్కేలా చేయడం తగదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

News April 19, 2026

కడప కలెక్టరేట్ వద్ద మాస్టార్ల ధర్నా.!

image

కడప కలెక్టరేట్ వద్ద శనివారం APTF ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డెక్కేలా చేయడం తగదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.