News November 21, 2024
విశాఖ డెయిరీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ డెయిరీ ఉద్యోగులు అక్కిరెడ్డిపాలెం డెయిరీ ముందు గురువారం రిలే నిరాహార దీక్షకు దిగారు. విశాఖ కో-ఆపరేటివ్ డెయిరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కేవివి మూర్తి, కార్యదర్శి ఎస్.రమణ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.21వేలకు పెంచాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా బోనస్, ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అగ్రిమెంట్ పద్ధతిపై ఉన్న ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేయాలన్నారు.
Similar News
News April 18, 2026
విశాఖలో ఒక్కరోజే 2,430 కేసులు నమోదు

విశాఖలోని శుక్రవారం ఒక్కరోజే 2,430 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,137, పిలియన్ రైడర్-223, ట్రిపుల్ రైడింగ్- 82, ఓవర్ స్పీడ్-220, సెల్ఫోన్ డ్రైవింగ్-28, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-15, మైనర్ డ్రైవింగ్ 03, రాంగ్ పార్కింగ్-180, డ్రంకన్ డ్రైవింగ్-35, సీజ్ అయిన వెహికల్స్-43, ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-547 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయగా 20 బస్సులు తనిఖీ చేశారు.
News April 17, 2026
జీవీఎంసీ ఓపెన్ ఫారంకు 43 వినతులు

జీవీఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయని సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. మధురవాడ జోన్-06, ఈస్ట్ జోన్-09, సౌత్ జోన్-02, నార్త్ జోన్-08, వెస్ట్ జోన్-05, పెందుర్తి జోన్-11, గాజువాక జోన్కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి ఒకటి చొప్పున వినతలు అందాయని చెప్పారు. వీటిని సంబంధిత జోనల్ కార్యాలయంలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
News April 17, 2026
జీవీఎంసీ ఓపెన్ ఫారంకు 43 వినతులు

జీవీఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయని సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. మధురవాడ జోన్-06, ఈస్ట్ జోన్-09, సౌత్ జోన్-02, నార్త్ జోన్-08, వెస్ట్ జోన్-05, పెందుర్తి జోన్-11, గాజువాక జోన్కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి ఒకటి చొప్పున వినతలు అందాయని చెప్పారు. వీటిని సంబంధిత జోనల్ కార్యాలయంలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.


